Devotional

₹200కోట్లతో తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ అతిథిగృహాలు

₹200కోట్లతో తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ అతిథిగృహాలు

రూ.200 కోట్లతో తిరుమలలో నిర్మించనున్న నూతన అతిధి గృహాలకు రేపు శంకుస్థాపన జరుగనుంది.

ఈ మేరకు కర్ణాటక ఎండోమెంట్స్ కమిషనర్ రోహిణి సింధూరి ప్రకటన చేశారు.

మైసూరు మహారాజుల సమయం నుంచి తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి 7ఎకరాలు భూమి ఉందని తెలిపారు.

ఈ స్థలంలో 200 కోట్లతో నిర్మించనున్న నూతన అతిధి గృహాలకు రేపు ఏపీ సీఎం జగన్‌తో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప శంకుస్థాపన చేయనున్నట్లు రోహిణి తెలియజేశారు.