Movies

డ్రగ్స్ విచారణలో అన్నీ అబద్ధాలే చెప్పారు

డ్రగ్స్ విచారణలో అన్నీ అబద్ధాలే చెప్పారు

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌ శనివారం జరిగిన ఎన్సీబీ విచారణలో అబద్ధాలు చెప్పారని సుశాంత్‌ సింగ్ రాజ్‌పూత్‌ స్నేహితుడు యువరాజ్ ఆరోపణలు చేశారు. సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసును డ్రగ్స్‌ కోణంలో విచారిస్తోన్న ఎన్సీబీ అధికారులు సారా, శ్రద్ధాకపూర్లకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణలో పాల్గొన్న సారా, శ్రద్ధా.. సుశాంత్‌ మాదకద్రవ్యాలు వినియోగించడం చాలా సందర్భాల్లో చూశామని, కానీ తాము మాత్రం డ్రగ్స్‌ తీసుకోలేదని ఎన్సీబీ ఎదుట చెప్పినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ స్నేహితుడు యువరాజ్‌ సదరు నటీమణుల విచారణ గురించి స్పందించారు.

‘తాము ఎలాంటి తప్పు చేయలేదని, సుశాంత్‌ మాత్రం తరచూ డ్రగ్స్‌ వినియోగించడం చూశామని సదరు నటీమణులిద్దరూ పూర్తిగా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లు చెప్పిన ఈ మాటలు గురించి వింటుంటే నవ్వొస్తోంది. వాళ్లు నా స్నేహితుడిపై బురద జల్లుతున్నారు. తాము కూడా డ్రగ్స్‌ వినియోగిస్తామని, సరఫరా చేస్తామని.. ఒకవేళ ఎన్సీబీ విచారణలో కనుక వాళ్లు అంగీకరించివుంటే వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకుంటారనే విషయం వాళ్లకి తెలుసు. అందుకే వాళ్లు కొన్ని విషయాలు బయటకు చెప్పలేదు.’