Movies

నాటి సునీత అదృష్టం నేటి శూన్యం

నాటి సునీత అదృష్టం నేటి శూన్యం

ప్రముఖ గాయని సునీత భావోద్వేగానికి గురయ్యారు. గురువుగా భావించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో అంతా శూన్యంలా మారిందని అన్నారు. ఏదో జన్మలో అదృష్టం చేసుకోవడం వల్లే బాలుగారితో పరిచయం ఏర్పడిందని, ఆయనతో కలిసి ఎన్నో పాటలు పాడే అవకాశం దక్కిందని తెలిపారు. దయచేసి ఆయన లేరని ఎవరూ అనొద్దని.. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారని ఆమె వివరించారు. ఈ మేరకు సునీత సోషల్‌మీడియా వేదికగా ఎస్పీబాలుతో తనకున్న అనుబంధం గురించి తెలియజేస్తూ తాజాగా ఓ వీడియో పోస్ట్‌ చేశారు.