Devotional

సంపూర్ణ కాశీయాత్ర అంటే ఏమిటి?

సంపూర్ణ కాశీయాత్ర అంటే ఏమిటి?

ఏ తీర్థయాత్రకైనా పరమార్థం తనలో ఉన్న పరమాత్మను ఆ క్షేత్రంలోని దివ్యమంగళ విగ్రహరూపంలో దర్శించటమే. ఇలా దర్శించే ప్రయత్నంలో చేసే యాత్రలలో కాశీ-రామేశ్వరం-కాశీ సందర్శనను సంపూర్ణ యాత్రగా పెద్దలు చెప్పారు. కాశీ క్షేత్రం ఉత్తర భారతంలో (పై భాగంలో) ఉంటుంది. రామేశ్వరం దక్షిణ భారతంలో (కింది భాగంలో) ఉంది. ఉత్తర దిశ నుంచి దక్షిణానికి వచ్చి, మళ్లీ ఉత్తరానికి చేరితే.. ఒక ఆవృత్తి పూర్తవుతుంది. కనుక దీనిని సంపూర్ణ యాత్ర అన్నారు. కాశీ నుంచి నేరుగా రామేశ్వరానికి వెళ్లి. అక్కడి నుంచి మళ్లీ కాశీకి చేరుకోవడం మాత్రమే సంపూర్ణ యాత్ర కాదు. పూర్వం కాశీ క్షేత్రం నుంచి వరసగా యాత్రలు చేస్తూ దక్షిణాపథంలోని రామేశ్వరం చేరుకునేవారు. రామేశ్వరం నుంచి మళ్లీ మరో మార్గంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కాశీకి చేరుకునేవారు. ఇలా దేశంలోని ప్రముఖ క్షేత్రాలు దర్శించుకోవడం వల్ల దీనిని సంపూర్ణయాత్రగా పరిగణించేవారు. దీనికి ప్రతీకగా.. కాశీలోని గంగా జలం తెచ్చి రామేశ్వరంలోని సముద్రంలోనూ, రామేశ్వర తీరంలోని సైకతాన్ని (ఇసుక) తీసుకెళ్లి కాశీలోని గంగలో కలపడం ఆచారంగా వచ్చింది.