Movies

ఆనబెల్‌తో థియేటర్లలో కలుద్దాం

ఆనబెల్‌తో థియేటర్లలో కలుద్దాం

వైవిధ్యభరిత నాయికా ప్రాధాన్య చిత్రాలతో ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదిలోనూ వరస విజయాలతో సత్తా చాటుతోంది నటి తాప్సీ. ఇప్పుడామె నటుడు విజయ్‌ సేతుపతితో కలిసి నూతన దర్శకుడు దీపక్‌ సుందర్‌రాజన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా జైపూర్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేసింది. ఈ సందర్భంగా ఆఖరి రోజు సెట్లో దిగిన ఓ ఫొటోని పంచుకుంటూ.. ‘‘కొన్ని నెలల క్రితం ఇదొక సుదూరమైన కలలా అనిపించింది. ఇప్పుడు అది పూర్తయింది. ‘అనబెల్లె’కు వీడ్కోలు సమయం. త్వరలో థియేటర్లో కలుద్దాం’’ అని వ్యాఖ్యానించింది. ఒక విభిన్నమైన పీరియాడికల్‌ కథాంశంతో తెర కెక్కుతోన్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యమున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో తాప్సీ, విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.