Devotional

ఏడుకొండల సామి కొందరివాడేనా?

Why Is TTD Not Issuing Free Darshan Slots

1) తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు చూస్తుంటే డబ్బున్న వాళ్ళకే శ్రీవారి దర్శనం అన్న చందంగా మారింది!
2) తిరుమల శ్రీవారి దర్శనానికి లాక్ డౌన్ సడలింపు తర్వాత 3 వేల మందితో ప్రారంభించి నేడు సుమారు 17 వేల మందికి దర్శనం కల్పిస్తున్నారు దైవానుగ్రహం!!
టిటిడి అధికారులు శ్రీవాణి ట్రస్టు ద్వారా ఒకరికి 10000 రూ దర్శనం, 300 రూ” ఆన్ లైన్ దర్శనాలు13 వేల మందికి,ప్రముఖులు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ₹500 రూ” దర్శనాలు, తిరుమల అధికారి,చైర్మన్ కార్యాలయం నుంచి సుపథం ద్వారా 300 రూ” దర్శనాలు మాత్రమే ప్రతిరోజు కల్పిస్తున్నారు!!
మరి…
3) సామాన్య భక్తుల కోసం గతంలో ఇస్తున్న “ఉచిత దర్శనాల” టోకెన్ లను ఎందుకు ప్రవేశ పెట్టడం లేదు!
4) శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చే సామాన్య భక్తుల,కొంతమంది స్థానికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు 10 వేల మందికి ఉచిత దర్శనాలకు అనుమతి ఇవ్వండి!!
అలాగే…
5) తిరుపతి అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు నడిచి వెళ్లే 9 కిలోమీటర్ల దూరంలో సుమారు 7.5 కిలోమీటర్లు ప్రస్తుతం కాలి నడకదారి పై ఉన్న సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ లను పగులగొట్టి పునర్నిర్మాణం చేపట్టడంపై పునరాలోచించాలి!
6) రిలయన్స్ కంపెనీ దాత ఇస్తున్న “25 కోట్ల” నిధులను పటిష్టంగా ఉన్న కాలి నడకదారి సిమెంట్ స్లాబ్ లను పగుల కొట్టకుండా మరమ్మతులు చేసి దాతను ఒప్పించి “శ్రీవారి భక్తుల” కోసం, “స్విమ్స్” హాస్పత్రి అభివృద్ధి కోసం వినియోగించేలా ధర్మకర్తల మండలి ఆలోచించాలి!
7) అలిపిరి కాలి నడక మార్గంలో సుమారు 1980 వ సంవత్సరంలో వేసిన సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ పై వాహన రాకపోకలు జరగవు ఒకవేళ ఎక్కడైనా సిమెంటు పెచ్చులు ఊడిపోయి ఉంటే మరమ్మతులు చేసి వినియోగించుకోవాలే తప్ప డొనేషన్ ఇస్తున్నారు కదా అని కూల్చివేయడం తొందరపాటు చర్య!
8)టిటిడి అధికారుల తీరు చూస్తుంటే “గుర్రపు నాడా దొరికిందని గుర్రాన్ని కొన్నట్లు” దాత సహృదయంతో ఇచ్చిన 25 కోట్ల రూపాయలను భక్తులు మెచ్చే విధంగా పదికాలాల పాటు నిలిచే విధంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలే తప్ప బాగున్న వాటిని కొట్టి కట్టడం”బూడిదలో పోసిన పన్నీరే” !!

నవీన్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ నేత
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్