NRI-NRT

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఝలక్

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఝలక్

విదేశీ విద్య పథకం కింద కొత్తగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చింది. ఈ పథకాన్ని పూర్తిగా సమీక్షించాలని స్పష్టం చేసింది. విదేశీ విద్య కింద గతంలో ఆర్థికసాయం పొందినవారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎలాంటి ప్రగతి సాధించారు? వంటి వివరాలను సేకరించాలని నిర్ణయించింది. కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా నిలిపేయడంతో పథకం కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. విదేశీ విద్యను ప్రభుత్వం కొనసాగించే అవకాశాల్లేవని సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.లక్షల సాయం అందించడానికి బదులు స్థానికంగా చదివే విద్యార్థుల్లో ఎక్కువ మందికి సాయం అందించవచ్చనే భావనలో ప్రభుత్వమున్నట్లు అధికారులు చెబుతున్నారు.