‘నటీనటులకు భాషా భేదాలు అనేవి ఉండకూడదు. ఒకకథ చెప్పడానికి ఏ భాషకైనా, ఏ ప్లాట్ఫామ్కి అయినా వెళ్లాలి’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. ‘గూఢచారి’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హైదరాబాదీ భామ ప్రస్తుతం హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూనే అమేజాన్, నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్లు చేస్తున్నారు. విభిన్న భాషల్లో సినిమాలు చేయడం గురించి శోభిత మాట్లాడుతూ – ‘‘యాక్టర్గా నన్ను నేను కథకురాలిగా చూస్తాను. కథను ఏ భాషలో చెబుతున్నాం, ఏ ఫ్లాట్ఫామ్లో చెబుతున్నాం అనేది పెద్దగా పట్టించుకోను. ఫీచర్ ఫిల్మ్ అయినా వెబ్ అయినా ఒకటే ఆసక్తితో నా పాత్రను చేస్తాను. ఒక మంచి కథ ఉంటే నటిగా వంద శాతం కష్టపడతాను. ఫలితం పెద్ద పట్టింపు కాదు. ఆ ప్రక్రియను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల.
నేను కథనే చూస్తాను
Related tags :