Health

శానిటైజర్లతో ప్రమాదం ఎక్కువ

శానిటైజర్లతో ప్రమాదం ఎక్కువ

కరోనా వల్ల హ్యాండ్​ శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

అయితే వీటిని అతిగా వాడటం వల్ల భవిష్యత్తులో తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని ఎయిమ్స్​ వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది.

యాంటీమైక్రోబియల్​ నిరోధకత సామర్థ్యం పెరిగి వ్యాధికారక సూక్ష్మజీవులపై ఔషధాల ప్రభావం తగ్గిపోతుందని వెల్లడించింది.

ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఔషధాలు పని చేయక ఏటా కోటి మంది ప్రమాదంలో పడతారని ఎయిమ్స్​ తెలిపింది.

ఎయిమ్స్​, అమెరికా సొసైటీ ఫర్​ మైక్రోబయాలజీ యాంటీబయోటిక్స్​ నిరోధకతపై సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్​లో​ పలు కీలక అంశాలను చర్చించారు.

ఎయిమ్స్​ మైక్రోబయాలజీ విభాగ అధిపతి డాక్టర్​ రామచౌదరి ఈ వెబినార్​కు అధ్యక్షత వహించారు.

ప్రపంచదేశాల్లో కొవిడ్​ విస్తరణ, యాంటీ మైక్రో బియాల్​ నిరోధకతతో పాటు వైద్య మౌలిక సదుపాయాలపై వైరస్​ ప్రభావం గురించి చర్చించారు.

అనేక అంటువ్యాధులు నివారించడంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీమైక్రోబియాల్స్‌ విఫలమవుతున్నాయని తెలిపారు.

దీని వల్ల యాంటీబయోటిక్​- రెసిస్టెంట్​ జీవులు వాతావరణంలో మరింత కఠినంగా స్థిరపడ్డాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.