క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని అందించడానికి మహిళల క్రికెట్ మినీ లీగ్ తేదీలు ఖరారయ్యాయి. యూఏఈ వేదికగా నవంబర్ 4 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరగనుందని బీసీసీఐ తెలిపింది. గతేడాది మాదిరిగానే సూపర్నోవస్, ట్రైల్బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు హర్మన్ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, స్మృతి మంధాన నాయకత్వం వహించనున్నారు. అయితే ఈ లీగ్లో థాయిలాండ్ నుంచి ఛాంతమ్ ప్రాతినిథ్యం వహించనుంది. ఆ దేశం నుంచి మినీలీగ్లో ఆడనున్న తొలి క్రికెటర్గా ఆమె రికార్డు సృష్టించనుంది.
నాలుగు మ్యాచ్లతో సాగే ఈ లీగ్లో భారత క్రికెటర్లతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాల్గొంటున్నారని బీసీసీఐ సెక్రటరరీ జై షా వెల్లడించాడు. కరోనా నేపథ్యంలో మహిళల టీ20 లీగ్ నిర్వహణపై సందేశాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే గతంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మహిళల మినీ లీగ్ తప్పక నిర్వహిస్తామని భరోసా ఇచ్చాడు. భారత్లో బదులుగా యూఏఈ వేదికగా లీగ్ను నిర్వహించనున్నారు.
సూపర్నోవస్: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, చామరి ఆటపట్టు, ప్రియా పునియా, అంజు పాటిల్, రాధా యాదవ్, తానియా భాటియా (వికెట్ కీపర్), శశికల సిరిరవర్ధనె, పూనమ్ యాదవ్, షకీరా, అరుంధతి, పూజ, అయూషి సోని, అయబోంగా ఖాకా, ముస్కన్ మాలిక్
ట్రైల్బ్లేజర్స్: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ, పునమ్, రిచా, హేమలత, పర్వేన్ (వికెట్కీపర్), రాజేశ్వరి, హర్లీన్, జులన్ గోస్వామి, సిమరాన్, సల్మా, సోఫి, చాంతమ్, డాటిన్, కస్వీ గౌతమ్
వెలాసిటీ: మిథాలీ రాజ్ (కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, షెఫాలీ వర్మ, సుష్మ వర్మ (వికెట్కీపర్), ఎక్తా, మన్సి జోషి, శిఖా పాండే, దేవిక, సుశ్రీ, మనాలీ దక్షిణి, కసపెరెక్, డేనియల్ వైట్, సునీ లూస్, జహానర అలమ్, అంగా
షెడ్యూల్
4-11-2020 సూపర్నోవస్ × వెలాసిటీ
5-11-2020 వెలాసిటీ × ట్రైబ్లేజర్స్
7-11-2020 ట్రైబ్లేజర్స్ × సూపర్నోవస్
9-11-2020 ఫైనల్