DailyDose

కసాయిగా మారిన కన్నతల్లి-నేరవార్తలు

కసాయిగా మారిన కన్నతల్లి-నేరవార్తలు

* అలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం…9 నెలల పసి కందుని విక్రయం చేసిన కన్న తల్లి…గూడురు మండలం మల్లవోలు గ్రామ పంచాయతీలోని కుమ్మరిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుందిఇద్దరు పిల్లల తల్లి ఐ భర్త చనిపోయిన సంవత్సరం గడవకముందే మల్లి పెళ్లి చేసుకోవాలనే దురాలోచనతో పసి కందుని విక్రయించిన తల్లి అని తల్లడిల్లిపోతున్న అమ్మమ, బాబాయ్, బందువులు…గూడురు మండల పరిదిలోని పొలీస్ స్టేషన్లో ఈ ఘటన చొటుచేసుకుంది.

* అనంతపురం రాంనగర్ లోని త్రివేణి హోమ్స్ లో అక్రమ కట్టడం.6 వ ఫ్లోర్ కూల్చి వేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.6 లక్షలు లంచం తీసుకుని పర్మిషన్ ఇచ్చి ఇపుడు బిల్డింగ్ పడగొతాము అని లంచం కోసం ఇబ్బంది పెడుతూ ఉన్నారని బిల్డర్ ఆవేదన.

* జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా.హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టుల్లో జరగాల్సిన విచారణ.సెలవులో ఉన్న న్యాయమూర్తి.నిన్న కూడా వాయిదాపడ్డ విచారణ.

* విజయవాడ హనుమాన్ పేట పార్సిల్ సెంటర్ వద్ద అగ్నిప్రమాదంలో కొత్తకోణం..పార్సిల్ సెంటర్ పై అంతస్తులో ఉంటున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు..ఘటనా ప్రదేశంలో మంటల్లో యువతి సజీవదహనం..యువకుడికి తాకిన మంటలు, పరిస్థితి విషమం..యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు..ప్రేమను నిరాకరించిందని అక్కసుతో యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకుడు..నగరంలో ఓ ప్రయివేట్ కోవిడ్ సెంటర్ లో నర్స్ గా విధులు నిర్వహిస్తున్న యువతి.