Sports

శ్రీకాంత్ నుండి శుభవార్త

శ్రీకాంత్ నుండి శుభవార్త

కరోనా వైరస్‌ విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ పోరులో కిదాంబి శ్రీకాంత్‌ దూసుకుపోతున్నాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో కెనడా ఆటగాడు జేసన్‌ ఆంథోనీపై 21-15, 21-14 తేడాతో ఘన విజయం సాధించాడు. కేవలం 33 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేశాడు. దీంతో తొలి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాడు. మార్చిలో జరిగిన ఆల్‌ ఇంగ్లాండ్‌ పోటీల్లో శ్రీకాంత్‌ చివరిసారి రాకెట్‌ పట్టాడు. మరోవైపు ఈ టోర్నీలో ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసినా 2021 ఒలింపిక్స్‌కు అర్హత పాయింట్లను కేటాయించడం లేదని బీడబ్ల్యూఎఫ్‌‌ ఇదివరకే స్పష్టం చేసింది. ఇక రెండో మ్యాచ్‌లో తలపడే సెకండ్‌ సీడ్‌ చౌటీన్‌ చెన్‌, నాట్‌ గెయెన్‌ల మధ్య ఎవరు గెలిస్తే వారితో శ్రీకాంత్‌ శుక్రవారం తొలి క్వార్టర్‌ ఫైనల్‌ ఆడనున్నాడు.