NRI-NRT

ప్రతిభావంత విద్యార్థులకు తానా పురస్కారం

TANA Foundation Cheyutha Program Helps Two Poor Merit Students In Kurnool

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ “చేయూత” కార్యక్రమం ద్వారా కర్నూలుకి చెందిన జయసాయి, తన్వి శ్రీజలకు నలభై వేల రూపాయల పురస్కార పారితోషికం అందించారు. కరోనా వైరస్ కారణంగా ప్రతిభాపాటవాలు కలిగిన చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం ఈ పారితోషికాలు అందిస్తున్నామని తానా కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు. తానా ఫౌండేషన్ కోశాధికారి శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ “చేయూత” కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వెయ్యు (1000) మందికి పైగా విద్యార్థులకు పారితోషికాలు అందించామని తానా అధ్యక్షులు జై తాళ్ళూరి, ఫౌండేషన్ ఛైర్మన్ శృంగవరపు నిరంజన్ తెలిపారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.