Business

ఏసీ రైలు పేరిట దోపిడీ

ఏసీ రైలు పేరిట దోపిడీ

దసరా పండుగ ప్రత్యేక రైలు పేరుతో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కి ప్రత్యేక రైలు (రైలు నం. 02784) నడుపుతున్న రైల్వే శాఖ. ఈ రోజు సాయంత్రం 5.50 నిముషాలకు ప్రారంభమవ్వాల్సిన రైలు. రైలు మొత్తం ఏసీ పేరుతో రైల్వే శాఖ అధిక ఛార్జీల వసూలు. ఏసీ పనిచేయకపోయినా రైలు నడిపేందుకు యత్నం. ఉక్కపోత తట్టుకోలేక చైన్ లాగి రైలు ఆపేసిన ప్రయాణికులు. కనీసం కిటికీలు కూడా లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి. పలుమార్లు రైలు నడిపే ప్రయత్నం చేసినా? చైన్ లాగి అడ్డుకున్న ప్రయాణికులు. రైల్వే సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు. ఇప్పటికీ కదలని రైలు.