Movies

తుగ్లక్ దర్బార్‌లోకి రాశిఖన్నా

తుగ్లక్ దర్బార్‌లోకి రాశిఖన్నా

రాశీ ఖన్నా తమిళంలో వరుస చిత్రాలతో జోరు చూపిస్తోంది. ఆమె ఇప్పటికే సూర్యకు జోడీగా ఓ కొత్త చిత్రంతో పాటు ‘అరన్‌మనై 3’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ జాబితాలో ‘తుగ్లక్‌ దర్బార్‌’ చేరింది. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ప్రసాద్‌ దీన్‌దయాల్‌ దర్శకుడు. 7స్క్రీన్‌ స్టూడియో పతాకంపై లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో సేతుపతికి జోడీగా రాశీ ఖన్నాని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా ఆమె ట్విటర్‌లో స్పందిస్తూ ‘‘ఈ చిత్రంలో భాగస్వామి అయినందుకు, మరోసారి విజయ్‌ సర్‌తో చేస్తున్నందుకు సంతోషంగా ఉంద’’ని తెలిపింది.