Fashion

బొడ్డురాయి ప్రతిష్ఠకు వివాహితలు కూడా ఎందుకు హాజరవ్వాలి?

బొడ్డురాయి ప్రతిష్ఠకు వివాహితలు కూడా ఎందుకు హాజరవ్వాలి?

గ్రామాల్లో బొడ్రాయి ప్రతిష్ఠ చేస్తే… గ్రామస్థులంతా ఉండాలంటారు? పెళ్లయిన ఆడపిల్లలు కూడా తప్పకుండా ఆరోజు గ్రామానికి రావాలంటారు.. ఎందుకు?
గ్రామానికి గరిమనాభి లేదా కేంద్రం అయిన ప్రదేశంలో గ్రామదేవతకు ప్రతినిథిగా బొడ్రాయిని ప్రతిష్ఠించే ఆచారం ఉంది. ఆ విధమైన ప్రతిష్ఠ జరిగే రోజున ఆ గ్రామస్థులందరూ ఊళ్లోనే ఉండాలని, పెళ్లయి వేరేచోట్ల ఉంటున్న ఆడపడుచులు కూడా ఆనాడు స్థానికంగా ఉండాలనేది ఒక ఆచారంగా వస్తోంది. దీనికి కారణం.. బొడ్రాయిని ప్రతిష్ఠించటం అంటే ఊరి నడిబొడ్డును గుర్తించటం అన్నమాట. ఆ భౌగోళిక పరిజ్ఞానం, ఊరి నిర్మాణంపై ప్రజలకు అవగాహన కలగాలనేది ప్రధానమైన ఆంతర్యం. దీనిలో భాగంగానే ఆడపడుచులను సైతం ప్రతిష్ఠకు పిలుస్తారు. అంతేకాదు, ఊళ్లోని వారంతా కలుసుకుని ఐకమత్యంతో ఉండాలనీ, ఊరి బాగు కోసం అందరూ ఆలోచించాలనీ పెద్దల ఆశయం. ప్రతిష్ఠకే కాదు.. ఏటా ప్రతిష్ఠా వార్షికోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయంగా ఉంది.