WorldWonders

పూరీ జగన్నాథుడికి 2500కిలోల వెండి విరాళం

పూరీ జగన్నాథుడికి 2500కిలోల వెండి విరాళం

పూరిలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయంలో తలుపులకు 2500 కిలోల వెండిపూతతో తలుపులు తయారు చేసి ఇచ్చేందుకు ముంబై నగరానికి చెందిన ఓ భక్తుడు ముందుకు వచ్చారు.కొన్ని దశాబ్దాల తర్వాత పూరి జగన్నాథ్ ఆలయంలోని చెక్క తలుపులు, గర్భగుడి తలుపులకు మలేషియా నుంచి తెప్పించిన బర్మా టేకుతో పాటు పై పూతగా 2,500 కిలోల వెండిని వినియోగించాలని నిర్ణయించారు.రూ.15.32 కోట్ల విలువగల వెండిని ఆలయ తలుపుల తయారీ కోసం విరాళంగా ఇచ్చేందుకు ముంబై భక్తుడు ముందుకు వచ్చారు.