DailyDose

సికింద్రాబాద్‌లో బాంబు పేలుడు-నేరవార్తలు

సికింద్రాబాద్‌లో బాంబు పేలుడు-నేరవార్తలు

* సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం వద్ద భారీ పేలుడు!ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు.చెత్తను తొలగిస్తుండగా ఘటన.ఆందోళనకు గురైన స్థానికులు.సికింద్రాబాద్ లో ఉన్న ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఈ ఉదయం జరిగిన ఓ పేలుడుతో తీవ్ర కలకలం రేగింది.ఆలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో వ్యర్థాలను తొలగించేందుకు వచ్చిన ఓ వ్యక్తి, దానిలో కనిపించిన పెయింట్ డబ్బాను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, భారీ శబ్దంతో అది పేలింది.ఈ ప్రమాదంలో అతనికి గాయాలు అయ్యాయి.విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.పేలింది ఓ టిన్నర్ డబ్బా అని ప్రాథమికంగా తేల్చారు.దసరా పండగ నాడు ఈ ఘటన జరగడంతో, ఆలయంలోని భక్తులతో పాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

* కృష్ణాయపాలేనికి చెందిన 11 మంది అమరావతి రైతులపై కేసులు నమోదయ్యాయి.మంగళగిరి గ్రామీణ పోలీసులు రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు.3 రాజధానులకు మద్దతుగా ఆటోలో దీక్షకు వెళ్తున్న వారని అడ్డగించారన్న ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు.

* మదనపల్లి మండలంలోని అబ్బగొంది నాయునివారి పల్లిలో నీళ్ల విషయంలో దాయాదుల గొడవ పడ్డారు…ఈ గొడవలో తమ్ముడు, పినతండ్రిపై కొడవళ్ళతో పైశాచికంగా దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన వారిని కుటుంబ సభ్యులు స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు….రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.