Devotional

31న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

31న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

అక్టోబ‌రు 31న తిరుమ‌ల‌లో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల‌లో ప్ర‌తినెలా జ‌రిగే పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ అక్టోబ‌రు 31న శ‌నివారం సాయంత్రం 5 నుండి 6 గంటల మ‌ధ్య జ‌రుగ‌నుంది.

కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

కాగా, అక్టోబ‌రు నెల‌లో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి మూడుసార్లు గ‌రుడ‌సేవ జ‌ర‌గ‌డం విశేషం.

ఈ నెల‌లో ఇప్పటికే పౌర్ణ‌మి సంద‌ర్భంగా అక్టోబరు 1న‌, శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 20న గ‌రుడ వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.