Food

ఈ మిఠాయి పూత బంగారం!

ఈ మిఠాయి పూత బంగారం!

బంగారంతో చిన్న ఉంగరం చేయించుకోవటానికే చుక్కలు కనిపిస్తున్న ప్రస్తుత సమయంలో గుజరాత్​ సూరత్​లోని ఓ మిఠాయిల వ్యాపారి ఏకంగా బంగారం పూతతో స్వీట్లు తయారు చేసి ఆకట్టుకుంటున్నారు. దీపావళి సందర్భంగా జరుపుకొనే చండీ పద్వో పండుగ కోసం ఈ పసిడి స్వీట్లు విక్రయానికి ఉంచారు. మరి వీటి ధరెంతో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
*సాధారణంగా మిఠాయిలపై పూత కోసం వెండిని వాడుతుంటారు కొందరు వ్యాపారులు. అయితే సూరత్‌కు చెందిన ఓ మిఠాయి దుకాణం యజమాని.. ఏకంగా బంగారం పూతను వాడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మామూలు సమయాల్లో కిలోకు రూ.600 నుంచి రూ. 800 పలికే ఆ మిఠాయి ధర.. బంగారం పూత కారణంగా కిలో రూ.9 వేలకు చేరింది. దీపావళి సమయంలో జరుపుకొనే చండీ పద్వో సందర్భంగా.. ఈ స్వీట్‌ను అమ్మకానికి ఉంచినట్లు మిఠాయి దుకాణం యజమాని రోహన్​ తెలిపారు.
*బంగారం పూతతో మిఠాయిలుచండీ పద్వో పండుగ సమయంలో ప్రజలు స్వీట్లను పంచుతారు. ఇందుకు ఎక్కువ మంది ఘరీ అనే మిఠాయిను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలోనే.. 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేకంగా వీటిని తయారుచేశారు. ఈ మిఠాయిలను ‘గోల్డ్‌ ఘరీ’గా పిలుస్తున్నారు.
*ఆరోగ్యకరమేనా..!
వివిధ రకాల డ్రై ఫ్రూట్లతో తయారు చేసే ఘరి.. పసిడి పూత వల్ల ఆకర్షణీయంగా మారింది. ఆయుర్వేదంలో బంగారాన్ని ప్రయోజనకరమైన లోహంగా పరిగణిస్తారని, తాము తయారు చేసిన గోల్డ్‌ ఘరీ ఆరోగ్యకరమైనదని మిఠాయి దుకాణం యజమాని తెలిపారు. వీటికి మార్కెట్​లో డిమాండు తక్కువగానే ఉన్నా.. రాబోయే రోజుల్లో మాత్రం కొనుగోళ్లు పెరుగుతాయని రోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.