NRI-NRT

ఢిల్లీ నుండి చైనా వెళ్లి కరోనా అంటించుకున్న 19మంది భారతీయులు

ఢిల్లీ నుండి చైనా వెళ్లి కరోనా అంటించుకున్న 19మంది భారతీయులు

భారత్‌ నుంచి చైనా వెళ్లిన విమానంలో 19 మంది భారతీయులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా దిల్లీ నుంచి చైనాలోని వుహాన్‌ నగరానికి అక్టోబర్‌ 30న ఈ విమానం వెళ్లింది. ఆ విమానంలో ప్రయాణించిన వారిలో 19మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మరో 39మందిలో యాంటీ బాడీలు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వైరస్‌ సోకిన వారిని ఆస్పత్రులకు తరలించినట్టు భారతీయ అధికారులు తెలిపారు. యాంటీ బాడీలు గుర్తించిన వారిని కూడా ఆస్పత్రులకు తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు.