కథానాయికల కెరీర్లో తొలి సినిమా ఓ పరీక్షలాంటిదని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. ఏ భాషలోనైనా అరంగేట్రం చేసిన సినిమా పరాజయం పాలైతే మానసికంగా కృంగిపోతామని పేర్కొంది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ సొగసరి తాజాగా బాలీవుడ్లో రణ్వీర్సింగ్ సరసన ‘సర్కస్’ అనే చిత్రంలో నటించబోతున్నది. ఈ సందర్భంగా మాట్లాడిన పూజాహెగ్డే..బాలీవుడ్లో తన ప్రయాణం ఆశించినంత గొప్పగా సాగలేదని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘హిందీలో నా తొలిచిత్రం ‘మొహంజదారో’ అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. ఆ షాక్ నుంచి నేను తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. బాలీవుడ్లో తొలి ప్రయత్నమే ఫెయిల్యూర్గా మిగిలిపోవడంతో చాలా విరామం తీసుకున్నా. కొన్నేళ్ల తర్వాత ‘హౌస్ఫుల్ 4’తో విజయాన్ని దక్కించుకున్నా. ప్రస్తుతం తెలుగులో కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు నన్ను జయాపజయాలు ఏమాత్రం ప్రభావితం చేయలేవు’ అని చెప్పుకొచ్చింది పూజాహెగ్డే. తెలుగులో ఈ భామ ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.
పరాజయంతో పూజకు మైండ్ బ్లాంక్
Related tags :