Politics

దుబ్బాకలో కమలం జోరు. 1135 ఓట్ల ఆధిక్యంలో భాజపా!

కౌంటింగ్‌ రెండు రౌండ్లలో 14,573 ఓట్లు లెక్కించారు. అందులో భాజపాకు 6,492 ఓట్లు రాగా, తెరాసకు 5,357ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి 1315 ఓట్లు సాధించారు. కౌంటింగ్‌ రెండో రౌండ్‌లో తెరాసపై భాజపా 794 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్‌లో వచ్చిన 341 ఓట్ల ఆధిక్యంతో కలిపి మొత్తంగా 1135 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్టీయే, మహాగట్‌ బంధన్‌ కూటముల మధ్య హోరీహోరీగా పోరు కొనసాగుతోంది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను, భాజపా 60, జేడీయూ 50, ఆర్జేడీ 61, కాంగ్రెస్‌ 24, ఎల్‌జేపీ 8, ఇతరులు 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 22 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.