WorldWonders

Flash: ORRపై ప్రమాదం. ఆరుగురు మృతి.

Flash: ORRపై ప్రమాదం. ఆరుగురు మృతి.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు మండలం పాటి వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామం వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వాహనం ముందున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ వాహనంలో ఉన్న ఆరుగురు మృతిచెందారు. సీఐ రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు బొలేరో వాహనంలో హైదరాబాద్‌ నుంచి పటాన్‌చెరు వైపు ఔటర్‌రింగ్‌రోడ్డులో వెళ్తున్నారు. వారి వాహనం పాటిగ్రామ శివారు చేరుకునేసరికి అదే రోడ్డుపై వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.