Devotional

కొరియర్ ద్వారా శబరిమల ప్రసాదం

కొరియర్ ద్వారా శబరిమల ప్రసాదం

కేరళ శబరిమలలోని అయ్యప్పస్వామి దివ్య ప్రసాదాన్ని భక్తులకు కొరియర్ ద్వారా అందించనుంది ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు.

స్థానికంగా ఉండే ఏ పోస్టాఫీసులో అయినా రూ.450 చెల్లించి బుక్​ చేసుకుంటే సరాసరి ఇంటికే పంపించనుంది.

నవంబర్​ 7 నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు ఆలయ అధికారులు.

ఈ కిట్​లో ప్రసాదం, పసుపు, కుంకుమ, విభూతి, నెయ్యి కలిపి పంపనున్నారు.

ఈ సేవలను దేవాలయపాలక మండలి, ఇండియన్​ పోస్టల్​ విభాగం సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

ఇప్పటికే బుక్​ చేసుకున్న వారికి ఈ నెల 16 నుంచి కిట్లను పంపిణీ చేయనున్నారు.

కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ప్రసాదం ఇంటికి చేరుకుంటుంది.

ఒక బుకింగ్​పై వచ్చిన మొత్తంలో దేవస్థానం బోర్డు రూ.250, మిగిలిన సొమ్ము పోస్టల్​ విభాగం తీసుకోనున్నాయి.