Politics

చపాతీ కర్ర మూలంగా ఓడిపోయామంటున్న తెరాస శ్రేణులు

చపాతీ కర్ర మూలంగా ఓడిపోయామంటున్న తెరాస శ్రేణులు

ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి . మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వచ్చింది . అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి కూడా వచ్చింది . కానీ, 20 వ రౌండ్ నుంచి ఫలితం మారిపోయింది . 20, 21, 22, 23 మిగతా రౌండ్ లలో బీజేపీ లీడింగ్ సాధించడంతో విజయం సాధించింది . ముందుగా సర్వేలు చెప్పినట్టుగానే బీజేపీ దుబ్బాకలో ఘన విజయం సాధించింది . దుబ్బాకలో బీజేపీ 1118 ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీపై విజయం సాధించింది . ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెమటలు పట్టించి మరీ ..బీజేపీ విజయం సాధించింది . తమ ఓటమికి చపాతి రోలర్‌ గుర్తు కారణమని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు . వివరాల్లోకి వెళితే .. కారును పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్ ని కేటాయించారు . ఈ గుర్తే టీఆర్‌ఎస్‌ కొంప ముచ్చిందని సొంత పార్టీ నాయకులు అనుకుంటున్నారు . అయితే ..చపాతీ రోలర్‌ అచ్చం కారు లాగే ఉండటం విశేషం . ఈ ఎన్నికలో కారును పోలిన గుర్తు చపాతీ రోలర్ కు 3489 ఓట్లు వచ్చాయి . అలాగే ..నోటాకు నోటా కు 552 ఓట్లు పోల్‌ అయ్యాయి . చపాతీ రోలర్‌ ఓట్లు టీఆర్‌ఎస్‌ కు వచ్చేయని …దుబ్బాక ప్రజలు కారు గుర్తు అనుకుని చపాతీ రోలర్‌ కు వేసారని టీఆర్‌ఎస్‌ నాయకులు వాపోతున్నారు . ఏది ఏమైనా చివరికి దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేసింది