Sports

ధోనీని కొనసాగించడం డబ్బుల దండగ

ధోనీని కొనసాగించడం డబ్బుల దండగ

ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టుకు ప్రవేశం కల్పించాలంటే బీసీసీఐ 2021 సీజన్‌కు మెగా వేలాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మెగా వేలం నిర్వహిస్తే చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని వదులుకోవడమే ఆ జట్టుకు ప్రయోజనమని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ధోనీని విడిచిపెట్టిన తర్వాత రైట్ టూ కార్డ్‌ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుందని తెలిపాడు. అలా కాకుండా రిటైన్డ్ ప్లేయర్‌గా జట్టుతో కొనసాగిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బును నష్టపోతారని అన్నాడు.