Business

అశ్వగంధ పాలు విడుదల చేసిన బ్రాహ్మణి

Heritage Director Nara Brahmani Releases Aswagandha Milk

రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద లక్షణాలున్న అశ్వగంధ పాలను హెరిటేజ్‌ ఫుడ్స్‌ విపణిలోకి విడుదల చేసింది. పాలతో పాటుగా అశ్వగంధ ఆయుర్వేద మూలికలను కలిపి తీసుకోవడం శతాబ్దాలుగా ఉందని, ఒత్తిడిని నివారించే గుణాలు ఇందులో ఉన్నాయని హెరిటేజ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి అన్నారు. ఈ అశ్వగంధ పాలలో కృత్రిమ నిల్వ పదార్థాలేవీ కలపలేదని తెలిపాదు. ప్రముఖ స్టోర్లు, ఇ-కామర్స్‌, ఎంపిక చేసిన విక్రయ కేంద్రాలు, హెరిటేజ్‌ పార్లర్లతో ఇవి లభిస్తాయన్నారు. హెరిటేజ్‌ టచ్‌ యాప్‌ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. 170 మిల్లీ లీటర్ల పాల ధరను రూ.30గా నిర్ణయించామని వెల్లడించారు. వీటితోపాటు రూ.10, రూ.20లకు చిన్న నెయ్యి ప్యాకెట్లను సైతం హెరిటేజ్‌ ఫుడ్స్‌ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.