Politics

ఏపీ రాజకీయాలపై జగన్ సమీక్ష

ఏపీ రాజకీయాలపై జగన్ సమీక్ష

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై అందుబాటులో ఉన్న మంత్రులతో తాడాపల్లిలోని క్రాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ వ్యవహారంపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్‌ఈసీ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపైనా చర్చకు వచ్చింది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపైన మంత్రులతో చర్చించారు. బల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడు లేదా ఆయన భార్యకు టికెట్‌ ఇచ్చే విషయంపై సమాలోచనలు చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని పెట్టే అంశంపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.