Agriculture

బంగాళాఖాతానికి అతిపెద్ద బెంగ

బంగాళాఖాతానికి అతిపెద్ద బెంగ

ఆమ్లశాతం పెరుగుదల కారణంగా బంగాళాఖాతంలో జీవావరణం క్రమంగా ముప్పు ముంగిట్లోకి వెళ్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా రూ.లక్షల కోట్ల విలువైన సంపద తరిగిపోయే ప్రమాదముందని సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (ఎన్‌ఐఓ) శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత పెరుగుతుండడంతో బంగాళాఖాతానికీ ముప్పు తీవ్రత అధికమవుతోంది. ద్రావణాల పీహెచ్‌ (పొటెన్షియల్‌ ఆఫ్‌ హైడ్రోజన్‌) విలువ 0-14 వరకు ఉంటుంది. 0-7 వరకు ఉంటే ఆమ్లశాతం ఉన్నట్లుగానూ, 7-14 వరకు ఉంటే క్షారశాతం ఉన్నట్లుగా పేర్కొంటారు. సరిగ్గా 7 ఉంటే ఆమ్ల, క్షార లక్షణాలు సమపాళ్లలో ఉన్నట్లు పరిగణిస్తారు. ఆమ్లశాతం పెరిగితే సముద్రంలోని జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంటుంది. ఆమ్లశాతం పెరిగితే సముద్రంలో ఉండే ‘ఆల్గే’ అనే జీవజాతి నశించిపోతుంది. దాన్ని తిని బతికే ‘జూప్లాంక్టన్‌’ అనే జీవరాశి కూడా మనుగడ సాగించలేదు. ఫలితంగా ఆ రెండింటిపై ఆధారపడే మత్స్యసంపద, జీవసంపద మొత్తానికి ముప్పు వచ్చినట్లే.