NRI-NRT

న్యూజెర్సీలో చిత్తూరు మహిళ అనుమానస్పద మృతి

న్యూజెర్సీలో చిత్తూరు మహిళ అనుమానస్పద మృతి

అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ మృతిచెందింది. పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత మరణించింది. చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లికి చెందిన సుధాకర్ నాయుడుతో 2016లో వివాహం జరిగింది. అప్పటికే అమెరికాలోని న్యూజెర్సీలో సుధాకర్ సాఫ్ట్‌‌‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 2017లో సుధాకర్ భార్య ప్రేమలతతో పాటు అమెరికా వెళ్లారు. వీరికి గీతాంష్ రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ప్రేమలతది ఆత్మహత్య కాదని..సుధాకర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తండ్రి త్యాగరాజు నాయుడు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమలత మృతదేహాన్ని పంపించడానికి భర్త నిరాకరిస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.