Fashion

కోవిద్ రోగులకు మరో హెచ్చరిక

కోవిద్ రోగులకు మరో హెచ్చరిక

కొవిడ్‌-19 బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాక మొదటి పది రోజుల్లో ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఫలితంగా ఆసుపత్రిలో తిరిగి చేరడానికి, మరణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కరోనాతో సంబంధం లేని నిమోనియా, గుండె వైఫల్యం సమస్యలతో అదే ఆసుపత్రిలో చేరిన ఇతర రోగులతో పరిశోధకులు పోల్చి చూశారు. కొవిడ్‌ బాధితులు డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆసుపత్రి పాలుకావడానికి లేదా మరణించడానికి ఆస్కారం 40-60 శాతం ఉన్నట్లు గుర్తించారు. అయితే 60 రోజుల తర్వాత మాత్రం గుండె వైఫల్యం, నిమోనియా బాధితులతో పోలిస్తే కరోనా బాధితులకు ఈ రెండు రకాల ముప్పులు బాగా తక్కువగా ఉన్నట్లు తేల్చారు. మొదటి రెండు నెలల్లో కొవిడ్‌ బాధితుల్లో 9 శాతం మంది మరణించారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో 20 శాతం మంది తిరిగి ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. ఆసుపత్రుల్లో ఉండగానే 18.5 శాతం మంది చనిపోయారని వివరించారు. మొత్తంమీద.. తీవ్రస్థాయిలో అనారోగ్యంపాలైన కొవిడ్‌ బాధితులకు మొదటి రెండు వారాల్లో సాధారణం కన్నా ఎక్కువ ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తించారు.