NRI-NRT

అమరావతి రైతులకు ఎన్నారైల పాదపూజ

Amaravathi JAC NRIs Performs Paada Puja To Farmers

ఆంధ్రుల రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఏడాదిగా పోరు సలుపుతున్న రైతులకు ప్రవాసులు పాదపూజ చేశారు. ఎన్నారై తెదేపా నాయకులు జయరామ్ కోమటి మార్గనిర్దేశంలో అమరావతి యువజన జెఎసి కన్వీనర్ రాయపాటి సాయికృష్ణ, గుమ్మడి గోపాలకృష్ణ, మూల్పూరి సాయికళ్యాణి తదితరులు రైతులకు పాదపూజ చేశారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం, తుళ్లూరు, రాయపూడి, అనంతపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల్లోని రైతులకు “రాజధాని రైతు పోరాట” కండువాలు పంపిణీ చేశారు.