ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కర్నూలు రాజవిహార్ సెంటర్ లో ద్విచక్ర వాహనదారుల భద్రతపై అవగాహనా సదస్సు నిర్వహించారు. తానా కార్యదర్శి పొట్లూరి రవి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ కే.వి. మహేష్, ట్రాఫిక్ డిఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొని హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్లు ధరించడం వలన ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణాలను చాలావరకు తగ్గించగలమని ఇలాంటి సమాజ హిత కార్యక్రమాన్ని చేపట్టినందుకు తానా సంస్థను వక్తలు కొనియాడారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మీనాక్షి, సందడి మధు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో తానా హెల్మెట్ల పంపిణీ
Related tags :