NRI-NRT

రైలు ఢీకొని న్యూజెర్సీలో తెలంగాణా టెకీ మృతి

Telangana Techie Praveen Desini Dies In New Jersey Hit By A Train

హన్మకొండకు చెందిన టెకీ ప్రవీణ్ దేశిని(37) మంగళవారం ఉదయం ఎడిసన్ రైల్వే స్టేషన్‌లో సంభవించిన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయంకు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం న్యూయార్క్ వెళ్లేందుకు రైలు కోసం పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు పేర్కొంటుండగా, ఈ స్టేషన్‌లో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణీకులు మాత్రం పట్టాలపైకి అంత సులువుగా ఎవరినీ వెళ్లనివ్వరని…ఆయన దాటుతుండగా ప్రమాదం అంటున్నప్పటికీ…ఆయన మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.