Sports

ఇక IPLలో పది జట్లు

IPL 2022 Will Have 10 Teams Says Ganguly

పది జట్ల ఐపీఎల్‌కు బీసీసీఐ ఆమోదం లభించింది. 2022 నుంచి పది జట్లతో లీగ్‌ నిర్వహించేందుకు బీసీసీఐ పాలక మండలి ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డు సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో సభ్యులందరూ ఇందుకు అంగీకరించారు. అంతేకాకుండా 2028 లాస్‌ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చాలన్న ఐసీసీ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నుంచి కొన్ని విషయాలపై స్పష్టత రావడమే ఇందుకు కారణం.