DailyDose

ఏలూరు రేంజ్ డీఐజీ హెచ్చరిక-నేరవార్తలు

ఏలూరు రేంజ్ డీఐజీ హెచ్చరిక-నేరవార్తలు

* మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్రావు హెచ్చరించారు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు పోలీస్ స్టేషన్ సాధారణ తనిఖీలు అనంతరం రామచంద్రాపురం డీఎస్పీ డి బాలచంద్రారెడ్డితో కలిసి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక రక్షణ కొరకు దిశా పోలిస్ స్టేషన్ ఏర్పాటు చేశామని అలాగే వారి కొరకు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చామని ఆపదలో ఉన్న మహిళలు ఈ నెంబర్లను వినియోగించుకోవాలని అన్నారు.

* అచ్చుతాపురం పోలీసు స్టేషన్ లో దోంగల ముఠా అరెస్టు వారి వద్దనుండి ఎనిమిది తులాలు బంగారం,వెండి,73 వేలు నగదు వారి నుండి స్వాదినం చేసుకున్నారు

* అనంతపురం జిల్లా (శింగనమల)…వైఎస్సార్ ఇల్లు స్థలం పట్టా ఇవ్వలేదని ఆత్మహత్య కు ప్రయత్నం. గార్లదిన్నె మండల కేంద్రంలో ఇళ్ళ స్థలాల జాబితాలో పేరు రాలేదని మల్లయ్య అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ నుంచి దూకుతానని హల్చల్.

* బాందా జిల్లాలోని దుబెంకా పుర్వా గ్రామంలో ఓ ఇంటికి నిప్పంటుకున్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.

* వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలితీసుకుంది. ఆగి ఉన్న ఆటోను ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.