Politics

విశాఖలో భూకబ్జాలు ఉండవు

విశాఖలో భూకబ్జాలు ఉండవు

విశాఖలో భూకబ్జాలకు అవకాశం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం వీఎంఆర్డీఏలో జీఐఎస్‌ బేస్డ్‌ ల్యాండ్‌ మానిటరింగ్‌ వ్యవస్థను ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త విధానం ద్వారా వీఎంఆర్డీఏ భూములను పరిరక్షించడం సాధ్యపడుతుందన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా జీఐఎస్‌ బేస్డ్‌ ల్యాండ్‌ మానిటరింగ్‌ వ్యవస్థను చేపట్టామని.. లోటుపాట్లు సరిచేసుకొని ముందుకెళ్తామని వివరించారు. విశాఖలో ఇప్పటికే ఉన్న అక్రమ లేఅవుట్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.