NRI-NRT

ఆస్ట్రేలియాలో తెలంగాణా యువతి మృతి

TS Girl Dead In Australlia - In Road Accident

ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే… నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత(22) ఆస్ట్రేలియాలో ఎంఎస్‌ చదువుతోంది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందింది. యువతి తండ్రి వెంకటరెడ్డి ఆర్మీ విశ్రాంత ఉద్యోగి.