Health

రాజస్థాన్‌లో బర్డ్‌ఫ్లూ

రాజస్థాన్‌లో బర్డ్‌ఫ్లూ

రాజస్థాన్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకులమవుతున్న తరుణంలో ఇదో కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. తాజాగా జైపూర్‌లోని జలమహల్‌ సమీపంలో బర్డ్‌ఫ్లూ కారణంగా 7 కాకులు మృతి చెందాయి. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన కాకుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 252కి చేరింది. వరుసగా కాకులు మృతి చెందుతుండటంతో స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది.