Sports

కరోనా బారిన సైనా. ఓటమి బారిన సింధు.

కరోనా బారిన సైనా. ఓటమి బారిన సింధు.

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొన్నారు. కొన్ని వారాల క్రితమే సైనా కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.

సుదీర్ఘ విరామం అనంతరం ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుకు చుక్కెదురైంది. యోనెక్స్‌ థాయిలాండ్‌ ఓపెన్‌ సూపర్ 1000 టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్‌లో డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిక్‌ఫీల్డ్‌ చేతితో 21-16, 24-26, 13-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సింధు రెండో గేమ్‌లో ఓటమిపాలైంది. అయితే పోటాపోటీగా సాగిన రెండో గేమ్‌ ఆదిలో సింధుదే ఆధిపత్యం. కానీ బ్లిక్‌ఫీల్డ్‌ పుంజుకుని మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకువచ్చింది. ఆఖరి గేమ్‌లో జోరును కొనసాగిస్తూ బ్లిక్‌ఫీల్డ్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.