Movies

నేను చిరంజీవితో చేయట్లేదు

నేను చిరంజీవితో చేయట్లేదు

ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించనున్న సినిమాల గురించి గత కొంతకాలంగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని ఆయన పీఆర్‌వో వెల్లడించారు. మోహన్‌బాబు ప్రస్తుతం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో మాత్రమే నటిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా.. ‘కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు.. ప్రస్తుతానికి ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఆయన ఏ ఇతర ప్రాజెక్ట్‌కు ఇంకా సంతకం చేయలేదు. ఆయన చేయనున్న సినిమాల గురించి వస్తోన్న వార్తలను ఎవరూ నమ్మకండి. ఒకవేళ ఆయన ఏదైనా ప్రాజెక్ట్‌ను ఓకే చేసి ప్రకటిస్తే.. మేము మీకు తెలియజేస్తాం’ అని ట్వీట్‌ చేశారు. మోహన్‌బాబు కొన్ని భారీ ప్రాజెక్ట్‌లలో నటించనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ ఒకటి. ఇందులో మోహన్‌బాబు ఓ కీలకపాత్ర పోషించనున్నారంటూ పలు కథనాలు వచ్చాయి. అయితే సదరు వార్తలపై మోహన్‌బాబు కానీ, చిత్రబృందం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.