Politics

ఆటోడ్రైవర్ల కోసం ఇల్లు తనఖా పెట్టిన హరీష్‌రావు

ఆటోడ్రైవర్ల కోసం ఇల్లు తనఖా పెట్టిన హరీష్‌రావు

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయించి మంత్రి హరీష్‌రావు వారికి ఆర్థికంగా అండగా నిలిచారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేనందున మూలధనం కోసం మంత్రి తన సొంత ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టారు. ఇలా వచ్చిన రూ.45 లక్షల రుణాన్ని ఈ పరపతి సంఘంలో జమచేయించారు. ఇలా తన సొంత స్థలాన్ని తనఖా పెట్టి ఆటోడ్రైవర్లకు అండగా నిలిచిన మంత్రి హరీష్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. కష్టకాలంలో తమకోసం సొంత ఆస్తిని వదులుకోడానికి సిద్దపడ్డ మంత్రికి తమ కుటుంబాలన్నీ జీవితాంతం రుణపడి ఉంటామని ఆటోడ్రైవర్లు పేర్కొన్నారు.