Videos

నాగార్జున యూనివర్శిటీలో భరతమాతకు అవమానం-నేరవార్తలు

నాగార్జున యూనివర్శిటీలో భరతమాతకు అవమానం-నేరవార్తలు

* నాగార్జున యూనివర్సిటీ రిపబ్లిక్ డే వేడుకల్లో శృతిమించి ప్రవర్తన.భరతమాత, దేశభక్తి పాటలు వినిపించాల్సిన చోట జగన్ ను పొగుడుతున్న పాటలకు డ్యాన్సులు.భరతమాత వేషంలో ఉన్న విద్యార్థినిని మధ్యలో నిల్చోబెట్టి.. జగన్ పాటలకు డ్యాన్సులు వేయించిన యూనివర్సిటీ అధికారులు.

* తూర్పు గోదావరి జిల్లా…జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం వద్ద కరెంటు స్తంభాన్ని డీకొన్న కార్.కరెంటు తీగలు కారుపై పట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు ఇద్దరు అక్కడికక్కడే మృతి.

* తాడేపల్లి పరిధిలో ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడుతున్న కృష్ణ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచిన తాడేపల్లి పోలీసులు.

* గుంటూరు జిల్లా బాపట్లలో రైల్వే లైన్ నిర్మాణ పనుల ఇంజనీర్ యువరాజ్ హత్యకు గురయ్యారు.స్నేహితుడే అతడిని హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది.మృతదేహాన్ని నిందితుడు బాపట్ల శివారు నల్లమడ వాగు వంతెన కింద పాతిపెట్టాడు.ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

* శ్రీకాకుళం జిల్లా…వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన విద్యార్థి నగేశ్​ రణస్థలం వద్ద అనుమానాస్పదస్థితిలో సజీవ దహనం అయ్యాడు.

* ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వర రావ్ ఇంటిపై ఎసిబి సోదాలు..విశాఖపట్నం: విశాఖ నగర పరిధి లోని కొమ్మాది డివిజన్ ఎలక్ట్రికల్ ఏఈ గా పని చేస్తున్న నాగేశ్వరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.గురువారం ఉదయం తెల్లవారుజామునే ఏసీబీ అధికారులు ఏకధాటిగా దాడులు నిర్వహించారు.నాగేశ్వర్ రావు పై గతంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి.చేతికి లంచం తీసుకోనిదే.. ఏ పని చేయరన్న అపవాదును మూట గట్టుకున్నారు.ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టు కున్నారన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులకు సమాచారం ఉండడంతో గురువారం ఉదయం దాడులు నిర్వహించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.