Movies

జయలలిత తర్వాత ఇందిరాగాంధీలో…

జయలలిత తర్వాత ఇందిరాగాంధీలో…

బాలీవుడ్‌లో మరో ఆసక్తికర బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ. ఆమె కథతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైటిల్‌ రోల్‌ పోషించేది కంగనా రనౌత్‌. ప్రస్తుతం ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ బయోపిక్‌ తెరపైకి వచ్చింది.