ScienceAndTech

హైదరాబాద్‌లో మరో రెండు విద్యుత్ బస్సులు

హైదరాబాద్‌లో మరో రెండు విద్యుత్ బస్సులు

పర్యాటకులకు ఆకర్షించేందుకు టీఎస్‌టీడీసీ షిరిడీ, తిరుపతికి ప్రత్యేక వోల్వో బస్సు సర్వీసులు, హైదరాబాద్‌ నగరంలో రెండు ఎలక్ట్రికల్‌ బస్సులను నెలలో అందుబాటులోకి తీసుకురానున్నది. కరోనా నైపథ్యంలో ప్రస్తుతం రైళ్ల సాధారణ రాకపోకలు లేక చాలామంది దూరప్రయాణాలను వాయిదా వేసుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో షిరిడీ, తిరుపతి ప్యాకేజీలు సందర్శకులను ఆకట్టుకుంటాయని పర్యాటకశాఖ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రికల్‌ బస్సులకు ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయని, పూర్తి పర్యావరణహితంగా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తీసుకొస్తున్నామని వివరించారు.