Politics

నిమ్మగడ్డకు హైకోర్టు సూచనలు

నిమ్మగడ్డకు హైకోర్టు సూచనలు

ఎన్నికల నిబంధనలకు లోబడే కార్యక్రమం చేపట్టాలి: హైకోర్టు

ఇంటింటికీ రేషన్‌ పథకంపై ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది.

ఇంటింటికీ రేషన్‌ పథకం అమలుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల నిబంధనలకు లోబడే కార్యక్రమం నిర్వహించాలని సూచించింది.

కార్యక్రమ వివరాలతో 2 రోజుల్లో ఎస్‌ఈసీని సంప్రదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని 5 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీకి సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.