Movies

మైత్రీ నుండి ఉప్పెన

మైత్రీ నుండి ఉప్పెన

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా రాబోతున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఆదివారం ఈ సినిమాలోని ‘జల జల జలపాతం నువ్వు’ అంటూ సాగే ప్రేమగీతాన్ని యువ హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించారు. జస్ప్రీట్‌ జాస్జ్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. సముద్ర నేపథ్యంలో సాగే మెలొడీ సాంగ్‌ ఇది. విడుదలైన కొన్ని క్షణాల్లోనే శ్రోతల్ని విపరీతంగా అలరిస్తుంది. గతంలో విడుదలైన ఈ చిత్రంలోని మూడు పాటలు సంగీత ప్రియుల హృదయాల్ని హత్తుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తుంది.