Devotional

తమిళనాడులో శ్రీవారి ఆలయానికి భారీ విరాళం

తమిళనాడులో శ్రీవారి ఆలయానికి భారీ విరాళం

త‌‌మిళ‌నాడులోని శ్రీవారి ఆల‌య నిర్మాణానికి భారీ విరాళం వ‌చ్చింది. ఆలయ నిర్మాణానికి టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుడు కుమార‌గురు 4 ఎకరాల స్థలాన్ని, 3 కోట్ల 16 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అంద‌జేశారు. ఉల్లందూర్‌పేట‌లో త్వర‌లోనే ఆల‌య నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తామ‌ని సుబ్బారెడ్డి వివ‌రించారు.