Business

బ్యాంకుల సమ్మె-వాణిజ్యం

బ్యాంకుల సమ్మె-వాణిజ్యం

* ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై బ్యాంకు సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. మార్చి 15, 16 తేదీల్లో సమ్మె చేపట్టనున్నటు తొమ్మిది బ్యాంకు సంఘాల ఐక్యవేదికగా ఏర్పాటైన యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) వెల్లడించింది. ఈ తొమ్మిది సంఘాల నేతలు మంగళవారం సమావేశమై బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన సంస్కరణల అంశంపై చర్చించారు.

* వినియోగ‌దారులు చేయ‌వ‌ల‌సింద‌ల్లా బ్యాంక్ మొబైల్ అప్లికేష‌న్‌ను ఉప‌యోగించి ఎటీఎం తెర‌పై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, యాప్‌లో పిన్‌ను న‌మోదు చేయాలి. అపుడు ఎటీఎం న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ ప్రాసెస్ అవుతుంది. కోవిడ్‌-19 వ్యాప్తి చెందిన‌ప్ప‌టి నుండి, కొన్ని బ్యాంకులు ఏటీఎం వ‌ద్ద కాంటాక్ట్‌లెస్ న‌గ‌దు ఉపసంహ‌ర‌ణ‌ను అందించ‌డానికి ప్ర‌య‌త్నించాయి. కానీ ఇది పూర్తిగా వ‌ర్క‌వుట్ కాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మాస్ట‌ర్‌కార్డ్ ఇపుడు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాల‌జీస్‌తో భాగ‌స్వామ్యం చేసుకుని పూర్తి కాంటాక్ట్‌లెస్ న‌గ‌దు ఉప‌సంహ‌రణ‌ను అందిస్తుంది. క‌స్ట‌మ‌ర్ చేయ‌వ‌ల‌సింద‌ల్లా బ్యాంక్ మొబైల్ అప్లికేష‌న్ ఉప‌యోగించి ఏటిఎం తెర‌పై వేగ ప్ర‌తిస్పంద‌న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయ‌డ‌మే.

* మీకు కారు ఉందా..? మరి ఫాస్టాగ్‌ తీసుకున్నారా..? ఫిబ్రవరి 15 నుంచి జాతీయ రహదారులపై టోల్‌ చెల్లింపులకు ప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసింది. నిజానికి ఈ ఏడాది ఆరంభం నుంచే పూర్తిస్థాయి ఫాస్టాగ్‌ వినియోగం అమల్లోకి రావాల్సి ఉండగా.. వాహనదారుల సౌలభ్యం కోసం మరో నెలన్నర పాటు గడువు పొడిగించారు. ఈ నెల 15 నుంచి వాహనదారులంతా తప్పనిసరిగా ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ కట్టాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ గతంలో ఓ ప్రకటనలో తెలిపింది.

* డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం తన అద్దె చెల్లింపుల సౌక‌ర్యాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు, అద్దెదారులు తమ నెలవారీ అద్దెను క్రెడిట్ కార్డుల ద్వారా తమ య‌జ‌మానుల‌ బ్యాంక్ ఖాతాకు తక్షణమే బదిలీ చేయవచ్చు. అటువంటి లావాదేవీలపై రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ప్రకటించింది. ప్రతి లావాదేవీకి క్యాష్‌బ్యాక్ సంపాదించడంతో పాటు, వినియోగదారులు క్రెడిట్ కార్డ్ పాయింట్లను కూడా సంపాదించుకోవ‌చ్చు. య‌జ‌మానికి చెల్లించడానికి, వినియోగదారు హోమ్ స్క్రీన్‌లోని “రీఛార్జ్ & పే బిల్స్” విభాగం నుంచి “అద్దె చెల్లింపు” ను ఎంచుకోవాలి. యూజర్లు క్రెడిట్ కార్డు నుంచి నేరుగా భూస్వామి బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. పేటీఎం యుపిఐ, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వంటి ఇతర చెల్లింపుల‌ ద్వారా అద్దె చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని కూడా ఇస్తుంది. వినియోగదారుడు య‌జ‌మాని బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసి అద్దెను చెల్లించ‌వ‌చ్చు. ఇందులో అన్ని అద్దె చెల్లింపులను ట్రాక్ చేసే స‌దుపాయం కూడా ఉంది. అదేవిధంగా స‌మ‌యానికి చెల్లింపు గడువు తేదీల గురించి గుర్తు చేస్తుంది, చెల్లించిన త‌ర్వాత‌ భూస్వాములకు తక్షణ చెల్లింపు నిర్ధారణను పంపుతుంది.

* చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, అన్ని బ్యాంక్ శాఖలను చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సిటిఎస్) పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అలాగే, వినియోగదారుల స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించడానికి డిజిటల్ చెల్లింపు హెల్ప్‌లైన్‌ను కేంద్రీకరించాలని సూచించింది. ప్రస్తుతం, భారతదేశం అంతటా చాలా క్లియరింగ్ హౌజ్‌ల‌లో సీటీఎస్ పనిచేస్తోంది. అయితే, కొన్ని బ్యాంక్ శాఖలు ఇంకా దాని పరిధిలోకి రాలేదు. సుమారు 18,000 బ్యాంక్ శాఖలు ఇప్పటికీ అధికారిక క్లియరింగ్ ఏర్పాట్లకు దూరంగా ఉన్నాయి. ఈ బ్యాంక్ శాఖలన్నింటినీ సెప్టెంబర్ నాటికి సిటిఎస్ క్లియరింగ్ పరిధిలోకి తీసుకురావాలని తెలిపింది. ఈ నిర్ణ‌యంతో దేశంలోని అన్ని బ్యాంకు శాఖలు సీటీఎస్ పరిధిలోకి వస్తాయి. ఇది కస్టమర్ సౌలభ్యాన్ని పెంచుతుంది. కాగిత-ఆధారిత క్లియరింగ్ వ్యవస్థకు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ విధానంతో చెక్కులు ప్రస్తుత బ్యాంకు వద్దే ఉంటాయి. చెక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్, క్లియరింగ్ హౌస్ ద్వారా చెల్లింపు శాఖకు చేరుస్తారు. దీంతోపాటు ఎంఐసీఆర్‌ బ్యాండ్, ప్రెజెంటేషన్ తేదీ, ప్రెజెంటేషన్ బ్యాంక్ వంటి సంబంధిత సమాచారాన్ని అందిస్తారు. ఇది భౌగోళిక, అధికార పరిధి పరిమితులను ఏక‌తాటిపైకి తెస్తుంది. తక్కువ ఛార్జీలతో వేగంగా, మెరుగైన, ఎటువంటి స‌మ‌స్య‌లు లేని సేవ‌ల‌ను అందిస్తుంది.